Translate

27 డిసెంబర్, 2021

త్రినాథ వ్రత కథ

 త్రినాథ వ్రత కథ :

#####################################


శ్రీపురం అను గ్రామమున ఆయావరపు బ్రాహ్మణుడు కలడు. అతనికొక కుమారుడు కలిగెను. తల్లి వద్ద బిడ్డకు ఇచ్చేందుకు పాలు లేవు. ఆమె  తన  భర్తతో పాలు కోసం ఆవు లేనిదే పిల్లవాడిని   పెంచడం కష్టమని చెప్పింది. అప్పుడు ఆయన " నేను ధనవంతుడిని కాను, ఆవును నేనెట్లా సంపాదించగలను! భగవంతుడా!!" అని బాధపడి, ఏమి తోచక ఇంట్లో ఉన్న పాతను సామానును తీసుకెళ్లి అమ్మాడు; ఆ సామానుకు 5 రూపాయలు వచ్చాయి. ఆ 5 రూపాయలతో ఆవును కొనడానికని బయలుదేరాడు.

అలా బయలుదేరిన బ్రాహ్మణుడు ఒక గ్రామం చేరాడు; అప్పుడు అదే గ్రామంలోని ఒక షావుకారి తన పశువులలో ఒక ఆవు లంకమేత(చేలల్లోకి వెళ్లి మేయడం ) కు  అలవాటు పడినదైనందు వల్ల, ఇంటిమీదకు గొడవలు వస్తున్నాయి, అందుకని ఆ ఆవును అమ్మడానికి నిశ్చయించుకొని, తమ చేను తిన్నదని చెప్పవచ్చిన వారందరితో ఆ ఆవు 50 రూపాయల ఖరీదైనదయినా 5 రూపాయలకే అమ్మేస్తానని అందరికి చెపుతుండగా, ఈ బ్రాహ్మణుడు అది విని "ఓ షావుకారు ! ఆడిన మాట తప్పుకు, ఇవిగో 5 రూపాయలు తీసుకొని ఆ ఆవును ఇవ్వు ." అని అన్నాడు.ఆ షావుకారు ఆ ఆవు పీడవదులుతులనందుకు సంతోషించి, ఆ ఆవును, ఆ బ్రాహ్మణుడికి అమ్మేశాడు.

ఆ బ్రాహ్మణుడు ఆ ఆవును, దాని పెయ్యను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ ఆవు పాలతో బిడ్డను సాకుకుంటున్నారు. ఇలా కొన్ని రోజులు గడవగా, ఒక రోజు ఆ ఆవు వేళకి ఇంటికి రాలేదు. ఆ ఆవును వెతుకుతూ ఆ బ్రాహ్మణుడు అడవిలోకి  వెళ్లి ఎంతగా వెతికినను దొరకలేదు. ఇంక వెతకలేక, అలుపు తీర్చుకుందామని ఒక మర్రి చెట్టు కింద పడుకున్నాడు.

అదే చెట్టు మీద ముగ్గురు కూర్చొని ఉన్నారు.  వారు అతనిని పిలిచి ఎందులకు అతను ఆలా దిగులుగా ఉన్నాడో విచారించగా, అతను తన కథను మొత్తం చెప్పుకొచ్చి, ఇక అతను సంతకు వెళ్లి ఆ ఆవును వెతికెదనని చెప్పాడు. అప్పుడు ఆ ముగ్గరు ఆయనతో  " నీవెట్లాగో సంతకు వెళ్తున్నావు కదా, ఇదిగో ఈ ౩ పైసలు తీసుకొని, మాకోసం గంజాయి ఆకు, వక్క, నూనెలు తీసుకొని రా" అని చెప్పారు.

సరేనని బ్రాహ్మణుడు సంతలో తన ఆవును వెతుకగా, లాభం లేకపోయే . అంతట ఆ ముగ్గురి కోసం  రెండు పైసలతో గంజాయి ఆకు, వక్క తీసుకొని, మరో పైసాతో నూనెను కొనడానికని నూనెల అంగడికి వెళ్లగా అందులోని ఓక ముసలి వ్యాపారి, ఆ బ్రాహ్మణుడిని పిచ్చివాడిలా చూసి, నూనెను సరిగ్గా కొలవకుండా, తక్కువ నూనె ఇచ్చి పంపివేసాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోగానే, అతని వద్ద ఉన్న నూనె అంత మాయం అయినది. అందులకు ఆ ముసలి వ్యాపారి మూర్చపోయాడు, పక్క అంగడి వాళ్ళు అతనిని సేదతీర్చగ, అతను మేలుకొనిన తరువాత జరిగింది వాళ్ళతో చెప్పగా , వారు ఆ బ్రాహ్మణుడిని వెతుకుంటూ వెళ్లి,  " అయ్యా బ్రాహ్మణోత్తమా! మీకు ఇచ్చిన నూనె కొలతల్లో తప్పు జరిగింది, మీకు సరిగ్గా కొలిచి ఇచ్చెదమని" చెప్పి, తిరిగి అంగడికి తీసుకొని వెళ్లి, సరిగ్గా కొలువగా, పోయిన నూనె సంబారమంతా తిరిగి వచ్చింది.అప్పుడు ఆ ముసలి వ్యాపారి సంతోషించగా, ఆ బ్రాహ్మణుడు, తిరిగి ఆ ముగ్గురి వద్దకు ఆ సరుకులు తీసుకొని వచ్చినాడు.

అప్పుడు సంతసించిన త్రిమూర్తులు ," ఓ బ్రాహ్మణుడా! మేము త్రిమూర్తులము, నీవు చాల కష్టాలు పడుతున్నావు, నిష్టతో నీవు మా వ్రతము చేసిన యెడల నీ దరిద్ర బాధ తీరును." అని చెప్పగా, అందుకు ఆ బ్రాహ్మణుడు " స్వామీ చాలా పేదవాడను , వ్రతములెలా చేయగలను?" అని బదులిడగా, " ఓయీ! మా ఈ వ్రతము చేయడానికి ఎక్కువ ఖర్చు అవసరము లేదు. నీవు సంత నుండి మాకోసం తెచ్చిన సరుకులతో చేసిన నీ కష్టాలు తీరును." అని చెప్పి అదృశ్యులైరి .



 వెంటనే ఇంటికి వెళ్లి భార్యకు జరిగినదంతా చెప్పి, సంతనుండి తీసుకొని వచ్చిన సరుకులతో, పరమ నిష్ఠతో ఆ వ్రతమును ఆచరించగా, పోయిన ఆవు దూడలు తిరిగి వచ్చినవి. వారి బాధలు తీరిపోయి, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సుఖంగా ఉన్నారు.

################################################

ఈ వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు.ఒక ౩ సంవత్సరాలు చెయ్యాలి, ఈ వ్రతాన్ని, ౩ లేదా 5 రోజులు చేస్తారు.రావి ఆకులను కూడా దేవుని పటముల వెనకగా ఉంచుతారు. ౩ రోజులు చేసేట్టైతే ౩ కలశములు. లేదా 5 రోజులైతే 5 కలశములు ఉంచి పూజను చేస్తారు.

ఓపికతో చదివినందుకు ధన్యవాదాలు.

త్రినాథ వ్రత కథ

 త్రినాథ వ్రత కథ : ##################################### శ్రీపురం అను గ్రామమున ఆయావరపు బ్రాహ్మణుడు కలడు. అతనికొక కుమారుడు కలిగెను. తల్లి వ...